ఉదయమైనప్పుడు వారు యేసును గవర్నరు పిలాతు దగ్గరకు తీసుకు వెళ్ళారు (27:2).
నిరపరాధి రక్తం అప్పగించినందుకు పశ్చాత్తాపపడిన యూదా ఆ వెండి నాణేలు విసిరివేసి వెళ్ళి ఉరి వేసుకున్నాడు (27:3-5).
వారు విదేశీయులను పాతిపెట్టడం కోసం కొంత పొలం కొన్నారు (27:6-7).
ఈ సంఘటనలు వల్ల యిర్మీయా ప్రవచనాలు నేరవేరాయి (27:9-10).
పిలాతు యేసును 'నీవు యూదుల రాజువా? అని అడిగాడు. అందుకు యేసు, 'అవును, నీవు అన్నట్టే' అని జవాబిచ్చాడు (27:11).
యేసు ఒక్క మాట కూడా బదులు పలకలేదు (27:12-14).
పస్కా పండుగ సాంప్రదాయం ప్రకారం పిలాతు యేసును విడుదల చేయించాలని కోరాడు (27:15-18).
ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని ఆమె పిలాతుకు వర్తమానం పంపించింది (27:19).
ప్రధాన యాజకులు, పెద్దలు యేసును కాక బరబ్బాను విడుదల చేయాలని కేకలు వేసేలా ప్రజలను ప్రేరేపించారు (27:20).
యేసును సిలువ వేయమని ప్రజలు కోరుకున్నారు (27:22-23).
పిలాతు ప్రజల ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి తాను నిరపరాధినని చెప్పి, యేసును జనసమూహానికి అప్పగించాడు (27:24).
ప్రజలు, "వాని రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండును గాక" అని కేకలు వేసారు (27:25).
సైనికులు యేసుకు అంగీ తొడిగించి, తలపై ముళ్ళ కిరీటం ఉంచి, ఆయనను గేలి చేస్తూ, ఆయన తలపై కొట్టి, సిలువ వేసేందుకు తీసుకువెళ్ళారు (27:27-31).
యేసు మోస్తున్న సిలువను మోయమని సీమోనును బలవంతపెట్టారు (27:32).
వారు "కపాల స్థలము" అని అర్ధం వచ్చే గొల్గొతాకు యేసును తీసుకువచ్చారు (27:33).
సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన దుస్తులు పంచుకొని, అక్కడే కూర్చుని ఆయనకు కాపలా కాస్తున్నారు (27:35-36).
"ఇతడు యూదుల రాజైన యేసు" అని వ్రాశారు (27:37).
యేసుకు కుడి పక్కన, ఎడమ పక్కన ఇద్దరు దొంగలను ఆయనతోపాటు సిలువ వేశారు (27:38).
తనను తాను రక్షించుకొని సిలువ దిగి రమ్మని యేసును సవాలు చేశారు (27:39-44).
మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది (27:45).
యేసు, "నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి" అని కేక వేసాడు (27:46).
యేసు ప్రాణం విడిచాడు (27:50).
యేసు మరణించిన తరువాత దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగింది (27:51).
సమాధులు తెరుచుకుని అనేకమంది పరిశుద్ధులు లేచి అనేకమందికి కనబడ్డారు (27:52-53).
"ఇతడు నిజముగా దేవుని కుమారుడు" అని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు (27:54).
ధనవంతుడైన యేసు శిష్యుడు యోసేపు పిలాతును యేసు దేహం తనకిమ్మని అడిగి, నారబట్ట చుట్టి తన సొంత కొత్త సమాధిలో ఉంచాడు (27:57-60).
ఒక పెద్ద రాయిని సమాధికి అడ్డంగా ఉంచారు (27:60).
యేసు దేహాన్ని ఎవరూ ఎత్తుకు వెళ్ళకుండా భద్రం చేయడానికి కాపలా పెట్టమని అడగడానికి కలిశారు (27:62-64).
సమాధి రాతికి ముద్ర వేసి, సైనికులను కాపలా ఉంచడానికి పిలాతు అనుమతి ఇచ్చాడు (27:65-66).