Matthew 28

Matthew 28:1

మగ్దలేనే మరియ, వేరొక మరియ ఏ రోజు, ఏ సమయంలో యేసు సమాధి దగ్గరకు వెళ్లారు?

ఆదివారం తెల్లవారుజామున వారు యేసు సమాధి దగ్గరకు వెళ్ళారు (28:1).

యేసు సమాధి రాయి ఎలా దొర్లించి ఉంది ?

దేవుని దూత రాయి దొర్లించాడు (28:2).

Matthew 28:3

అక్కడి కావలివారు దూతలను చూసి ఏమి చేశారు?

దూతకు భయపడి కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండిపోయారు (28:4).

Matthew 28:5

దూత యేసు గురించి ఆ స్త్రీలకు ఏమి చెప్పాడు?

యేసు మృతులలోనుండి లేచి గలిలయలోకి వారికంటే ముందుగా వెళ్ళాడు అని దూత చెప్పాడు (28:5-7).

Matthew 28:8

యేసు గురించి ఆయన శిష్యులకు చెప్పడానికి వెళ్ళిన ఆ స్త్రీలకు దారి మధ్యలో ఏమి జరిగింది?

యేసు వారికి ఎదురుపడ్డాడు. అప్పుడు వారు ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు (28:8-9).

Matthew 28:11

సైనికులు వచ్చి ప్రధాన యాజకులతో సమాధి వద్ద జరిగిన విషయాలు చెప్పినప్పుడు ప్రధాన యాజకులు ఏమి చేశారు?

ప్రధాన యాజకులు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి, యేసు దేహాన్ని ఆయన శిష్యులు ఎత్తుకు వెళ్ళారని ప్రచారం చెయ్యమని చెప్పారు (28:11-13).

Matthew 28:16

శిష్యులు యేసును గలిలయలో చూసినప్పుడు ఏమి చేశారు?

శిష్యులు యేసుకు మొక్కారు. అయితే కొందరు సందేహించారు (28:17).

Matthew 28:18

ఎలాంటి అధికారం తనకు ఇవ్వబడిందని యేసు చెప్పాడు?

పరలోకంలో, భూమి మీదా తనకు సర్వాధికారం ఇవ్వబడిందని యేసు చెప్పాడు (28:18).

యేసు తన శిష్యులకు ఇచ్చిన మూడు ఆజ్ఞలు ఏమిటి?

సమస్త జనులను శిష్యులనుగా చేసి, వారికి బాప్తిస్మం ఇస్తూ, యేసు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చాలని బోధించమని చెప్పాడు (28:19-20).

ఎవరి నామంలో బాప్తిసం ఇవ్వమని యేసు చెప్పాడు?

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమని యేసు తన శిష్యులకు చెప్పాడు (28:19).

Matthew 28:20

యేసు తన శిష్యులకు చేసిన చివరి వాగ్దానం ఏమిటి?

నేను యుగసమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు (28:20).