ఆదివారం తెల్లవారుజామున వారు యేసు సమాధి దగ్గరకు వెళ్ళారు (28:1).
దేవుని దూత రాయి దొర్లించాడు (28:2).
దూతకు భయపడి కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండిపోయారు (28:4).
యేసు మృతులలోనుండి లేచి గలిలయలోకి వారికంటే ముందుగా వెళ్ళాడు అని దూత చెప్పాడు (28:5-7).
యేసు వారికి ఎదురుపడ్డాడు. అప్పుడు వారు ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు (28:8-9).
ప్రధాన యాజకులు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి, యేసు దేహాన్ని ఆయన శిష్యులు ఎత్తుకు వెళ్ళారని ప్రచారం చెయ్యమని చెప్పారు (28:11-13).
శిష్యులు యేసుకు మొక్కారు. అయితే కొందరు సందేహించారు (28:17).
పరలోకంలో, భూమి మీదా తనకు సర్వాధికారం ఇవ్వబడిందని యేసు చెప్పాడు (28:18).
సమస్త జనులను శిష్యులనుగా చేసి, వారికి బాప్తిస్మం ఇస్తూ, యేసు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చాలని బోధించమని చెప్పాడు (28:19-20).
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమని యేసు తన శిష్యులకు చెప్పాడు (28:19).
నేను యుగసమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు (28:20).