పస్కా పండుగ రెండు రోజుల్లో రాబోతున్నదని యేసు చెప్పాడు (26:2).
వారు యేసును మాయోపాయము చేత పట్టుకొని ఆయనను చంపాలని ఆలోచన చేశారు (26:4).
పండుగ సందర్భంగా యేసుని చంపితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వారు భయపడ్డారు (26:5).
శిష్యులు కోపగించుకోని ఆ అత్తరును అమ్మి వచ్చిన ధనం పేదలకు పంచవచ్చు గదా అన్నారు (26:6-9).
నా భూస్థాపన కొరకు ఈమె ఈ అత్తరు పోసినదని యేసు చెప్పాడు (26:12).
యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు ప్రధాన యాజకులు ముప్ఫై వెండి నాణెములు చెల్లించారు (26:14-15).
తనను అప్పగింపబోయే వాడికి బాధ, వాడు పుట్టకుండా ఉన్నట్టయితే అతనికి మేలు అని యేసు అన్నాడు (26:24).
"నీవన్నట్టే" అని యేసు జవాబిచ్చాడు (26:25).
"దీనిని తీసికొని తినండి, ఇది నా శరీరము" అని చెప్పాడు (26:26).
"ఇది నా రక్తము, అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము" అని చెప్పాడు (26:28).
ఆ రాత్రి వారంతా తన విషయంలో అభ్యంతరపడతారని యేసు చెప్పాడు (26:30-31).
పేతురు ఈ రాత్రి కోడి కూయక ముందు తనను ఎరుగనని మూడుసార్లు చెబుతాడని యేసు చెప్పాడు (26:33-34).
శిష్యులను మెలకువగా ఉండి కనిపెట్టమని యేసు కోరాడు (26:37-38).
సాధ్యమైతే ఈ గిన్నెను నానుండి తొలగిపోనిమ్ము అని ప్రార్ధించాడు (26:39).
యేసు, తన చిత్తం కాక తండ్రి చిత్తమే నెరవేరాలని కోరాడు (26:39,42).
యేసు ప్రార్ధించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు (26:40,43,45).
యేసు శిష్యులను విడిచి మూడుసార్లు ప్రార్ధించడానికి వెళ్ళాడు? (26:39-44).
గుంపులో ఉన్న యేసును ముద్దు పెట్టుకోవడం అనే సూచనను బట్టి ఆయనే యేసు అని గుర్తించాలని యూదా చెప్పాడు (26:47-50).
యేసు శిష్యులలో ఒకడు కత్తితో ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికివేశాడు (26:51).
యేసు తన తండ్రిని కోరితే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సేనలను తండ్రి పంపుతాడని యేసు చెప్పాడు (26:53).
జరుగుతున్నఈ సంఘటనలన్నీ లేఖానాల నెరవేర్పు అని యేసు చెప్పాడు (26:54,56).
శిష్యులు అందరూ యేసును విడిచి పారిపోయారు (26:56).
ఆయనను చంపాలని యేసుకు వ్యతిరేకంగా ప్రజలచే అబద్ధ సాక్ష్యం చెప్పించాలని చూస్తున్నారు (26:59).
ప్రధాన యాజకుడు యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట తమతో చెప్పమని ఆజ్ఞాపించాడు (26:63).
యేసు, "నీవు చెప్పినట్టే" అని జవాబిచ్చాడు (26:64).
మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం ప్రధాన యాజకుడు చూస్తాడని యేసు చెప్పాడు (26:64).
యేసు దైవదూషణ చేస్తున్నాడని ప్రధాన యాజకుడు యేసుపై నేరారోపణ చేశాడు (26:65).
వారు యేసు ముఖంపై ఉమ్మివేసి, గుద్ది, అరచేతులతో కొట్టారు (26:67).
యేసు ఎవరో తనకు తెలియదని పేతురు చెప్పాడు (26:70,72,74).
మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే కోడి కూసింది (26:74).
తనను ఎరుగనని మూడుసార్లు పలికిన తర్వాతే కోడి కూస్తుందని యేసు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు (26:75).