బుద్ధి లేని కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేముందు తమ దివిటీలలో నూనె తీసుకు వెళ్ళలేదు (25:3).
బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే ముందు తమ దివిటీలలో సరిపడిన నూనె తీసుకు వెళ్లారు (25:4).
పెండ్లి కుమారుడు అనుకొన్నసమయం కంటే ఆలస్యంగాఅర్థరాత్రి సమయంలో వచ్చాడు (25:5-6).
బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారునీతో కలసి పెండ్లి విందుకు వెళ్లారు (25:10).
బుద్ధిలేని కన్యలు నూనె కొనేందుకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి విందు తలుపులు మోయబడ్డాయి (25:8-12).
ఆ దినమైనా, సమయమైనా తెలియదు గనుక విశ్వాసులు మెలకువగా, సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (25:13).
అయిదు తలాంతులు పొందినవాడు అదనంగా మరో అయిదు తలాంతులు సంపాదించాడు. రెండు తలాంతులు పొందినవాడు అదనంగా మరో రెండు తలాంతులు సంపాదించాడు (25:16-17).
అతడు ఒక గొయ్యి తవ్వి యజమాని ఇచ్చిన తలాంతును దాచిపెట్టాడు (25:18).
యజమాని చాలాకాలం వరకు తిరిగి రాలేదు (25:19).
యజమాని వారితో, "భళా నమ్మకమైన మంచి దాసుడా" అని మెచ్చుకొని వారిని అనేకమైన వాటిపై నియమించాడు (25:20-23).
యజమాని ఆ సేవకుణ్ణి "సోమరివైన చెడ్డ దాసుడా" అని చెప్పి అతని వద్దనుండి ఒక్క తలాంతు తీసి వేసి, అతణ్ణి చీకటిలోకి విసరివేయమని చెప్పాడు (25:24-30).
మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని సమస్త జనులను పోగుచేసి ఒకరినుండి ఒకరిని వేరుపరుస్తాడు (25:31-32).
రాజు కుడిపక్కన ఉన్నవారు లోకం పుట్టినది మొదలు తమ కోసం సిద్దపరచబడిన రాజ్యం పొందుతారు (25:34).
రాజు కుడిపక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు, దాహం ఉన్నవారి దాహం తీర్చారు, పరదేశులను ఆదరించారు, బట్టలు లేనివారికి బట్టలిచ్చారు, రోగులను పరామర్శించారు, ఖైదీలను దర్శించారు (25:35-40).
రాజు కుడి పక్కన ఉన్నవారు అపవాదికి, వాడి దూతలకు సిద్దపరచబడిన నిత్యాగ్నిలోకి పడద్రోయబడతారు (25:41).
రాజు ఎడమ పక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టలేదు, దాహం గొన్నవారి దప్పిక తీర్చలేదు, పరదేశులను ఆదరించలేదు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వలేదు, రోగులను పరామర్శించలేదు, ఖైదీలను దర్శించలేదు (25:42-45).