యెరూషలేములోని దేవాలయము రాయి మీద రాయి ఒక్కటికూడా నిలబడకుండా పడదోయబడుతుందని యేసు ప్రవచించాడు (24:2).
ఇవి ఎప్పుడు జరుగుతాయి, యేసు రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగారు (24:3).
అనేకులు యేసు పేరట వచ్చి తామే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసం చేస్తారు (24:5).
యుద్ధములు, కరువులు, భూకంపాలు మొదలైనవి వేదన కలగడానికి ప్రారంభమయ్యే సంభవాలు అని యేసు చెప్పాడు (24:6-8).
ఆ సమయంలో విశ్వాసులు శ్రమలపాలై చనిపోతారు, జనములచేత ద్వేషింపబడతారు, అనేకులు అభ్యంతరపడి అప్పగించుకొంటారు, ఒకరినొకరు ద్వేషించుకొంటారు (24:9-12).
అంతము వరకు సహించినవారు రక్షింపబడతారు (24:13).
రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమంతటా ప్రకటింపబడుతుంది (24:14).
విశ్వాసులు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండడం చూసినప్పుడు కొండలకు పారిపోతారు(24:15-18).
లోకం ఆరంభం నుండి ఇప్పటివరకు ఇలాంటి శ్రమ కలగలేదు, ఇకపై ఎప్పటికీ జరగదు (24:21).
అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరచి ఏర్పరచ బడిన వారిని మోసగిస్తారు (24:24).
మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనడుతుందో రాబోయే మనుష్య కుమారుడు కనబడతాడు (24:27).
సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చీకటి కమ్మివేస్తుంది. నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి (24:29).
మనుష్య కుమారుడు మహిమతో, ప్రభావముతో దిగి వచ్చుట చూసినప్పుడు భూమిపై ఉన్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకుంటారు (24:30).
దూతలు ఎంపిక చేయబడిన వారిని పోగుచేయడానికి వచ్చినప్పుడు గొప్ప బూర శబ్దం వినిపిస్తుండి (24:31).
ఈ విషయాలన్నీ జరిగే వరకు ఈ తరము గతించదని యేసు చెప్పాడు (24:34).
ఆకాశము, భూమి గతించి పోయినా ఆయన మాటలు గతింపవని యేసు చెప్పాడు (24:35).
కేవలం ఒక్క తండ్రికి మాత్రమే ఈ విషయాలన్నీఎప్పుడు జరుగుతాయో తెలుసు (24:36).
ప్రజలు తినుచూ, త్రాగుచూ పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు మనుష్య కుమారుని రాకడను గూర్చి తెలుసుకొనకుండా ఉంటారు (24:37-39).
ప్రభువు ఎప్పుడు వస్తాడో విశ్వాసులకు తెలియదు కనుక మెలకువ కలిగి సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (24:42,44).
నమ్మకమైన, బుద్ధిమంతుడైన సేవకుడు తన యజమాని ఇంట లేనప్పుడు యజమాని ఇంటివారి బాగోగులు చూసుకుంటాడు (24:45-46).
యజమాని తన యావదాస్తిపై ఆ సేవకునికి బాధ్యతలు అప్పగిస్తాడు (24:47).
యజమాని ఇంట లేనప్పుడు దుష్టుడైన సేవకుడు తన తోటి సేవకులను కొట్టి, తాగుబోతులతో కలసి తాగుతూ, తింటూ ఉంటాడు (24:48-49).
యజమాని తిరిగి వచ్చినప్పుడు దుష్టుడైన సేవకుణ్ణి రెండుగా నరికించి, ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే స్థలానికి తోలివేస్తాడు (24:51).