శిష్యులు వెళ్ళినప్పుడు వారికి కట్టబడియున్న ఒక గాడిద, దానితో గాడిద పిల్ల కనబడతాయని యేసు చెప్పాడు (21:2).
ప్రవక్త, ఇదిగో నీ రాజు గాడిదను, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచించాడు (21:4-5).
యెరూషలేము వీధుల్లో యేసు ప్రయాణిస్తున్నపుడు జనసమూహములు పైబట్టలు, చెట్ల కొమ్మలు దారి వెంట పరిచారు (21:8).
జనసమూహం "దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము" అని కేకలు వేశారు (21:9). .
దేవాలయములో ప్రవేశించి యేసు, క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి, గువ్వలను అమ్మేవారి బల్లలను పడదోశాడు (21:12).
దేవుని మందిరాన్ని వ్యాపారులు దొంగల గుహవలె చేశారని యేసు అన్నాడు (21:13).
బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్దింపజేసితివి అని ప్రవక్తలచే పలుకబడిన ప్రవచనం యేసు వారికి గుర్తు చేశాడు (21:15-16).
అది కాపు లేకుండా ఉన్నందువల్ల యేసు ఆ చెట్టుని శపించాడు (21:18-19).
వారు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటన్నిటినీ పొందుతారని యేసు బోధించాడు (21:20-22).
ప్రధాన యాజకులు, పెద్దలు యేసు దగ్గరకు వచ్చి, ఏ అధికారంతో యేసు ఈ పనులన్నీ చేస్తున్నాడని అడిగారు (21:23).
బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, లేక మనుషులనుండి కలిగిందా అని యేసు వారిని ప్రశ్నించాడు (21:25).
బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెబితే, యోహానును ఎందుకు నమ్మలేదని యేసు ప్రశ్నించవచ్చు (21:25).
బాప్తిసమిచ్చే యోహానును ఒక ప్రవక్తగా భావిస్తున్న ప్రజలకు భయపడి ఏ జవాబూ చెప్పలేదు (21:26).
మొదటి కుమారుడు ముందు వెళ్లనని చెప్పినప్పటికీ తరువాత తన మనస్సు మార్చుకొని వెళ్లి పని పూర్తిచేశాడు (21:28-31).
సుంకరులు, వేశ్యలు యోహాను నీతి మార్గమును నమ్మారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యోహాను నీతి మార్గమును నమ్మక పశ్చాత్తాపపడలేదు (21:31-32).
గుత్త కాపులు సేవకులలో ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరియొకరిపై రాళ్ళు రువ్వారు (21:35-36).
చివరగా యజమాని తన కుమారుణ్ణి పంపించాడు (21:37).
యజమాని కుమారుణ్ణి గుత్త కాపులు చంపివేశారు (21:38-39).
ఆ దుర్మార్గులైన గుత్త కాపులను సంహరించి పంటలో భాగం ఇచ్చే వేరే కాపులకు ఇవ్వమని చెప్పారు (21:40-41).
ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది (21:42).
దేవుని రాజ్యము ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు ప్రజల యొద్దకు తీసుకురాబడుతుంది (21:43).
యేసును ప్రజలు ప్రవక్త అని భావించినందువల్ల ప్రధాన యాజకులు, పరిసయ్యులు ప్రజలకు భయపడి యేసును బంధించలేకపోయారు (21:46).