Matthew 20

Matthew 20:1

ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఎంత కూలి ఇవ్వడానికి అంగీకరించాడు?

ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఒక దేనారము ఇవ్వడానికి అంగీకరించాడు (20:1-2).

Matthew 20:3

తొమ్మిది, పన్నెండు, మూడు, అయిదు గంటల సమయంలో కుదుర్చుకున్న పనివారికి ఎంత కూలి ఇస్తానని ఇంటి యజమాని చెప్పాడు?

ఏది న్యాయమో అది ఇస్తానని ఇంటి యజమాని కూలివారితో చెప్పాడు (20:4-7).

Matthew 20:8

పన్నెండు గంటలకు కుదుర్చుకున్న కూలీలకు ఎంత కూలి లభించింది?

పన్నెండు గంటలకు కుదుర్చుకున్న కూలీలకు ఒక దేనారము కూలి లభించింది (20:9).

Matthew 20:11

పొద్దున్న పనికి కుదర్చబడిన కూలీలు ఏమని సణుగుకొన్నారు?

తాము రోజంతా పనిచేసినప్పటికీ చివరి గంట పనిచేసినవారితో సమానమైన కూలీ దొరికిందని సణుగుకొన్నారు (20:11-12).

Matthew 20:13

కూలీలకు ఇంటి యజమాని ఏమని సమాధానమిచ్చాడు?

పొద్దుటి నుంచి పని చేసినవారికి చెప్పినట్టు ఒక దేనారం కూలి ఇచ్చానని, అయితే తన ఇష్ట ప్రకారం మిగతా కూలీలకు కూడా అంతే చెల్లించానని ఇంటి యజమాని చెప్పాడు (20:13-15).

Matthew 20:17

యేసు తన శిష్యులతో యెరూషలేము బయలుదేరేముందు తనకు జరుగబోయే ఏ ఏ విషయాలు ముందుగా తెలియజేసాడు?

తనను ప్రధాన యాజకులు శాస్త్రులు పట్టుకొని మరణ శిక్ష విధించి సిలువ వేస్తారని, తాను మూడవ రోజున తిరిగి లేస్తానని శిష్యులకు ముందుగా చెప్పాడు (20:17-19).

Matthew 20:20

జెబెదయి కుమారుల తల్లి యేసును ఏమి కోరుకుంది?

తన కుమారులు యేసు రాజ్యంలో ఆయనకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు కూర్చుని ఉండాలని యేసును కోరుకున్నది (20:20-21).

Matthew 20:22

పరలోక రాజ్యంలో తన కుడి పక్కన ఎడమ పక్కన ఎవరు కూర్చోవాలో నిర్ణయించే అధికారం ఎవరికి ఉన్నదని యేసు చెప్పాడు?

ఆయన ఎంపిక చేసిన వారికోసం తగిన స్థలాలను తండ్రి అయిన దేవుడు నిర్ణయిస్తాడు (20:23).

Matthew 20:25

తన శిష్యులలో గొప్పవాడుగా ఉండగోరిన వాడు ఎలా ఉండాలని యేసు చెప్పాడు?

గొప్పవాడుగా ఉండగోరిన వాడు పరిచారకుడుగా ఉండాలని ఉండాలని యేసు చెప్పాడు (20:26).

యేసు ఎందుకు వచ్చానని చెప్పాడు?

అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చానని యేసు చెప్పాడు (20:28).

Matthew 20:29

యేసు ఆ మార్గమున వెళ్తూ ఉండగా దారి పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివాళ్ళు ఏమి చేశారు?

ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు, "ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించు" అని కేకలు వేసారు (20:30).

Matthew 20:32

ఇద్దరు గుడ్డివాళ్ళను యేసు ఎందుకు స్వస్థపరిచాడు?

ఇద్దరు గుడ్డివాళ్ళను చూసి యేసు వారిపై కనికరపడ్డాడు (20:34).