కొందరు ఆహ్వానం లక్ష్యపెట్టలేదు, కొందరు తమ సొంత పనులకు వెళ్ళిపోయారు, కొందరు ఆ సేవకులను పట్టుకుని అవమాన పరచి చంపివేశారు (22:2-6).
రాజు తన సేనలను పంపి ఆ హంతకులను చంపించి, వారి నగరాన్ని తగలబెట్టించాడు (22:7).
తరువాత రాజు తన సేవకులకు కనబడినవారందరినీ, వారు మంచివారైనా, చెడ్డవారైనా అందరినీ పిలిపించాడు (22:9-10).
పెండ్లి దుస్తులు ధరించనివారి కాళ్ళు, చేతులు కట్టివేసి చీకటిలోకి తోసివేశాడు (22:11-13).
పరిసయ్యులు యేసును మాటలలో పెట్టి చిక్కుల్లో పడవేయాలని చూశారు (22:15).
కైసరుకు పన్ను కట్టడం న్యాయమా, కాదా అని యేసును అడిగారు (22:17).
కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి ఇవ్వమని వారికి జవాబిచ్చాడు (22:21).
పునరుత్దానము అనేది లేదని సద్దూకయ్యుల నమ్ముతారు (22:23).
ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు (22:24-27).
సద్దూకయ్యులకు లేఖానాలు, దేవుని శక్తీ గురించి తెలియదు (22:29).
పునరుత్థానంలో ఎవరూ పెండ్లి చేసుకోరని యేసు చెప్పాడు (22:30).
తండ్రియైన దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైయున్నాడని లేఖనాలను ప్రస్తావిస్తూ యేసు చెప్పాడు (22:32).
ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటని ప్రశ్నించాడు (22:36).
నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనేవి యేసు చెప్పిన ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలు (22:37-39).
క్రీస్తు ఎవరి కుమారుడు అని అడిగాడు (22:42).
క్రీస్తు దావీదు కుమారుడని పరిసయ్యులు జవాచ్చారు (22:42).
తన ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఎలా చెబుతున్నాడని యేసు అడిగాడు (22:43-45).
యేసు అడిగిన దానికి వారు ఎవరూ మాట్లాడలేకపోయారు (22:46).