మనం తప్పక మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అని యేసు చెప్పాడు (18:3).
తనను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని యేసు చెప్పాడు (18:4).
యేసునందు విశ్వాసముంచిన చిన్నవారిని అభ్యంతరపరచువాడు మెడకు తిరుగలి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట మేలు (18:6).
మనకు అభ్యంతరం కలిగించే దేనినైనా విసిరి పారవేయాలని యేసు చెప్పాడు (18:8-9).
చిన్నపిల్లలను ఎందుకు తృణీకరించకూడదంటే పిల్లల దూతలు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని చూస్తున్నారని యేసు చెప్పాడు (18:10).
ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు (18:12-14).
మొదటగా, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని తప్పు తెలియజెయ్యి (18:15).
రెండవదిగా, నీతో సహా ఇద్దరు ముగ్గురిని సాక్ష్యులుగా నీ వెంట తీసుకు వెళ్ళు (18:16).
మూడవది, ఆ సంగతి సంఘములో చెప్పాలి (18:17).
ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్ధించినప్పుడు వారి మధ్యన ఉంటానని యేసు వాగ్దానం చేస్తున్నాడు (18:20).
మనం మన సహోదరుణ్ణి ఏడుసార్లు మాత్రమే కాదు, డెభ్బై ఏళ్లసార్లు క్షమించాలని యేసు చెప్పాడు (18:21-22).
సేవకుడు తన యజమానికి పదివేల తలాంతులు అచ్చియున్నాడు. అతడు దానిని తీర్చలేకపోయాడు (18:24-25).
యజమాని ఆ సేవకునిపై కనికరపడి అతనిని విడిచిపెట్టి క్షమించాడు (18:27).
ఆ సేవకుడు తనకు వంద తలాంతులు అచ్చియున్న తోటి సేవకుణ్ణి క్షమించకుండా చెరసాలలో వేయించాడు (18:28-30).
యజమాని సేవకుణ్ణి పిలిచి అతడు క్షమించబడినట్టు, అతని తోటి దాసుని పట్ల కనికరం చూపాలని చెప్పాడు (18:33).
యజమాని తనకు అచ్చియున్నందంతా చెల్లించే వరకూ బాధపరచువారికి అతణ్ణి అప్పగించాడు (18:34).
యజమాని తన సేవకునిపట్ల చేసినట్టు, మనం మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా ఇలాగే చేస్తాడని యేసు చెప్పాడు (18:35).