Chapter 20

1 ఆ అల్లరి సద్దుమనిగిన తరువాత పౌలు శిష్యులను దగ్గరకు పిలిచి ప్రోత్సహక వాక్కులు చెప్పి వారిదగ్గర సెలవు తీసుకొని మయా సిదోనియకు బయలుదేరి వెళ్లారు. 2 ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి విశ్వాసుల్ని ప్రోత్సహించి గ్రీసు వచ్చెను. 3 అతడు అక్కడ మూడు నెలలు గడిచిన పిదప ఓడ మీద సిరియా వెళ్లాలని భావించాడు కానీ అక్కడి యూదులు అతని పై తిరుగుబాటు చేయుచున్నారని తెలిసికొని మాసిదోనియకు వెళ్లదానికి నిర్ణయించు ఉన్నాడు. 4 ఫుర్రస్ కుమారుడు, బెరయ ఊరికి చెందిన సోపత్రు, థెస్సలోనికవారు ఆరిస్తార్క్, సెకుందు దేర్బ్ ఉరివాడు గాయి తిమోతి, ఆసియ దేశాలకూ చెందిన తుకికు త్రోఫిము లు అతనితో అసియావరకు వచ్చిరి. 5 అయితే వారంతా ముందుగా వెళ్లి త్రోయలో మాకోసం ఎదురు చూస్తున్నారు. 6 మేము పులియని పిండితో చేసే రొట్టెల పండుగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి పెట్టి ఐదు దినాలు ప్రయాణించి త్రోయ చేరి వారి దగ్గర ఏడు దినాలు గడిపెను . 7 ఆది వారం నాడు మేము రొట్టెవిరవడానికి సమ కుడినప్పుడు పౌల్ తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్ధరాత్రి వరకు విస్తృతంగా మాట్లాడుతూ ఉండిపోయాడు. 8 మేము సమావేశంయిన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి. 9 పౌల్ చాలా సేపటినుండి ప్రసంగిస్తూ ఉండగా ఐతుకు అనే యువకుడు కిటికీలో కూర్చుని గాఢనిద్రపోతూ జోగి మూడవ అంతస్తు నుండి. క్రింద పడి చనిపోయాడు 10 అప్పుడు పౌలు కిందకి వెళ్లి అతని మీద పడుకొని కౌగిలించుకొని, "మీరిక చింతిచాల్సిన పనిలేదు . ఎందుకంటే అతను బ్రతికే ఉన్నాడు" ని వారితో అన్నారు. 11 అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి భుజించి తెల్లవార్లు ఆదితో ఎన్నో విషయాలు మాట్లాడి బయలుదేరాడు. 12 సజీవంగా ఉన్న ఆ యువకుణ్ణి లోపలికి తీ ఉక్కు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది. 13 మేము ఓడ ఎక్కి ఆస్సు అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ పౌలును ఎక్కించి కోవాలని బయల్దేరాము.తాము అక్కడి వరకు కాలినడకన రావాలని ఉద్దేశించి పౌలు మమ్మ్మల్ని ఆ విధంగా ఆదేశించాడు. 14 ఆస్సు అతడు మాతో కలసిన తరువాత మేమంతా మితిలేనికి వచ్చాము. 15 అక్కడినుండి బయలుదేరి కియోస్ ద్వీపనికి ఎదురుగా వచ్చాము.మరుసటి నాటికి సమోసు చేరుకొని. ఆ తరువాతి నాటికి మిలేతు చేరుకున్నాము. 16 సాధ్యమైతే పెంత్తుకొస్తు దినానికి యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడు చున్నాడు. ఆసియాలో కాలయాపన చెయ్యకుండా ఎఫెసు వెళ్లిపోవాలని అతడు నిశ్చయించు కున్నా డు. 17 అతడు మిలేతు లో ఉండగానే ఎఫెసులోని పెద్దలు కు కబురు పెట్టి పిలిపించాడు. 18 వారు వచ్చినపుడు వారితో యిలా అన్నాడు,"నేను ఆసియాలో కాలు మోపింది మొదలు మీమధ్య ఏ విధంగా ప్రవర్తించానో మీకే తెలుసు. 19 యూదుల కుట్రలవలన నాకు విషమ పరిస్థితులు సంభవించిన కాన్నిటితోను , సంపూర్ణమైన వినాయభావంతోము ప్రభువుకు సేవచేశాననీ మీకు తెలుసు . 20 ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి భోదించాను. 21 అంతేకాక , దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసము ఉం చాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇ స్తున్నానో, అంతా మీ కు తెలుసు. 22 ఇదిగో, ఇపుడు నేను ఆత్మ నిర్భం దంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు. 23 కానీ, పరిశుద్దాత్మ ప్రతి పట్టణములోను సాక్ష్యమిస్తూ నా కోసం సంకెళ్ళ, హింసలూ వేచి ఉన్నాయనిచెప్పాడని మాత్రం తెలుసు. 24 అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్షాన్ని ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు. 25 ఇది గో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను.మీరెవరూ ఇకముందు నా ముఖం చూడరని నాకు తెలుసు. 26 కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్ములనే సాక్ష్యంగా పెడుతున్నాను. 27 ఎందుకనగా దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమి దాచుకో లేదు. 28 ప్రభువు తన స్యరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్దాత్మ మిమ్మలను దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించి, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి 29 నాకు తెలుసు నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు వంటి వారు మిలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు. 30 అంతేకాక శిస్యూల్ని తమతో లాక్కుపోవడం కోసం వక్రమైన మాటలు పలికే వ్యక్తులు మిలోనుండే బయలుదేరుతారు. 31 కాబట్టి మూడుసంవత్సరాలు నేను రాత్రి పగలు కన్నీటితో మీలో ప్రతి ఒక్కరికి ఎడతెగక బుద్ధి చెప్తూ ఉన్నానని గుర్తుంచుకొని మెలకువగా ఉండండి. 32 ఇప్పుడు దేవునికీ, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికి పరిశుద్దులందరితో వారసత్యం అనుగ్రహించడానికి శ క్తిమంతుడు. 33 నేను ఎవరి వెండిని గాని,బంగారాన్ని గాని ఆశించలేదు. 34 నా అవస రాల నిమిత్తం, నాతో ఉన్న వారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. 35 మీరు కూడా అదే విధంగాప్రయాసపడి బలహీనులను సంరక్షించి, 'పుచ్చు కొనుటకంటే ఇచ్చుట ధన్యము', అని ఫ్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసికోవాలని, నేను అన్ని విషయాలలో మీకు ఆదర్శంగా నిలిచాను ". 36 అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలసి ప్రార్ధన చేసాడు. 37 అప్పుడు వారంతా చాలా ఏడ్చిన తరువాత పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు 38 మరి ముఖ్యముగా మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకు అతనిని సాగనంపారు.