Chapter 2

1 పెంతోకోస్తూ అన్ర్త్ఘ పండగహుద్జ్ రోజు వచ్చిదజ్ఫ్ .అంతజ్జ్ఫ్ ఒక చోతఃఫ్ సస్మవేసమంయయ్రుత్. 2 అప్పుఫుద్జు వేగంఫ్గాహ్డు విహిద్ఫ్ బలమైన్ద్ఫ్హన్స్ గాలిన్ వంటి సబ్ద్ధంద్ఫ్హ్ ఆకసంహ్గున్ నుండ్జ్హ్ ఆకస్మతుగాబ్ఝుద్ వారు కుర్చున్సజ్ద్జు ఇల్లంతడు నిన్దిన్దిన్జ్సుఫ్గ్. 3 జ్వలలుదు లనిదీ నలుకుకజ్డున్ చిలిస్నాట్టుఫ్హి విరికి కనదబద్జుకుండా, వారిద్ఝుద్న్ ప్రతిద్ఫ్ ఒకరిమిస్ఫ్హ వ్రాలయి . 4 అందహ్ద్రుఫ్ పారిశ్హుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వరినిదు మర్లదిన్న్ఫ్హిగ్నట్టుగా వేఎఉర్బ్న్సి వేరు బాషల్లిలావు మయ్ట్లదసగారుబ్ఫ్హు 5 ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి జనం లోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. 6 ఈ శబ్దం విన్న జన సందోహం కుడివచ్చి ప్రతివాడు తమ సొంత భాషల్లో వారు మాట్లాడటం విని కలవర పడ్డారు. 7 వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతు"మాట్లాడే వీరంతా గలిలయ వారే కదా. 8 మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడ్డం మనం వింటున్నామేంటి? 9 పార్తీయులు, మాదీయులు,ఎలామీయులు మెసొపోతామియా యూదయ కప్పదోకీయా అంతు ఆసియ 10 ఫ్రూగియా ఫంపులియా ఐగుప్తు అనే దేశాల వారూ కురేనే లో భాగంగా ఉన్న లిబియా ప్రాంతాలవారూ,రోము నుండి సందర్శకులుగా వచ్చిన 11 యూదులూ, యూదా మతంలోకి మరిన వారూ,క్రేతీయులు అరబీయులు మొదలైన మనమంతా వీరుమన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నామ"ని చెప్పుకొనిరి. 12 అందరూ ఆశ్చర్య చకితులై ఎటు తోచక ఏదేమిటోనని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. 13 కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు. పేతురు ఉపన్యాసం. యేసే ప్రభువు,,క్రీస్తు. 14 అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు."యూదయ ప్రజలారా , యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా , ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి. (1) యేవేలు ప్రవచనం నెరవేర్పు 15 మీరనుకున్నట్టు వీరు మద్యపానం చెయ్యలేదు.ఇప్పుడు ఉదయం తొమ్మిది అయిన కాలేదు. 16 వేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే. 17 అంత్యదినాల్లో నేను మనుషుయులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమార్తెలూ కుమారులూ ప్రవచిస్తారు. మీ యువకులకు దర్శనాలొస్తాయి. మీ వృద్ధులు కలలు కంటారు. 18 ఆ రోజుల్లో నా దాసులమీద దాసీలమీద నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు. 19 పైన ఆకాశంలో మహత్కార్యాలను కింద భూమ్మీద సూచక క్రియలను రక్తం, అగ్ని, పొగ, ఆవిరిని చూపిస్తాను. 20 ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ మహా దినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు. 21 ప్రభువు పేరున ప్రార్ధన చేసే వాళ్ళంతా పాప విముక్తి పొందుతారు అని దేవుడు చెప్తున్నాడు. (2) యేసు క్రియలు ఆయన్ను ప్రభువుగా క్రీస్తుగా నిరూపిస్తున్నాయి. 22 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజారేయుడైన యేసు చేత అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు మీ మధ్య చేయించి,ఆయనను తనదృష్టికి యోగ్యుడిగా కనబరచాడు.యిది మీకే తెలుసు. 23 దేవుని స్థిరమైన ప్రాణాళికనీ ఆయనకున్న భవిషత్ జ్ఞానాన్ని అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది.ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. 24 మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదన తొలగించ ఆయనను లేపాడు. (3)క్రీస్తు సజీవంగా తిరిగి లేచాక ఆయన రాజరికం గురించి దావీదు ప్రవచనం 25 ఆయన గూర్చి దావీదు యిలా అన్నాడు. నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను. ఆయన నా కుడి ప్రక్కనే వున్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు. 26 నా హృదయం ఉల్లాసంగా ఉన్నది. నా నాలుక ఆనందించింది. నా శరీరం కూడా ఆశ భావంతో నిశ్చింతగా ఉంటుంది. 27 నీవు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నీ పరిశుద్ధున్ని కుళ్లు పట్టనియ్యవు. 28 నాకు జీవ మార్గాలు తెలిపావు. నీ ముఖ దర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు. 29 సోదరులారా,పూర్వీకుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు. 30 అతని సమాధి ఇప్పటికి మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త కాబట్టి అతని గర్భఫలం నుండి అతని సింహాసనం మీద ఒకడిని కూర్చోబెడతానని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసినసంగతి ఎరిగి 31 క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండిపోలేదని , ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందే తెలుసుకొని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు. (4)యేసు పునరుత్థానం ఆయన్ను క్రీస్తుగా ప్రభువుగా నిరూపిస్తున్నది. 32 ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం. 33 కాబట్టి ఆయన దేవుని కుడి పక్కకు హెచ్చించడం జరిగింది.తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది మీరు చూస్తున్న వింటున్న పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. 34 దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు.అయితే అతడిలా అన్నాడు. 35 నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచేవరకు నీవు నా కుడిప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. యిది ఇశ్రాయేలు జాతి అంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి." (5) ఇశ్రాయేలు ప్రజల ప్రస్తుత కర్తవ్యం. 37 వారీ మాట విని హృదయంలో గుచినట్టాయి సోదరులారా మేమేం చెయ్యాలని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. 38 దానికి పేతురు మీరు పశ్చాత్తాపపడి పాపా క్షమాపణ కోసం ప్రతీవాడు యేసుక్రీస్తు పేరున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు 39 ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకూ,దూరంగా ఉన్న వారందరికీ , అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరకు పిలిచే వారందరికీ చెందుతుంది.అని వారితో చెప్పాడు. 40 ఇంకా అతడు నేక రకాలైన మాటలతో సాక్ష్యమిచ్చి"మీరు ఈ దుష్టతరం నుండి వేరుపడి రక్షణ పొందండి." అని వారిని హెచ్చరించాడు. 41 అతని సందేశం నమ్మినవారు బాప్తీస్మం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది సంఘంలో చేరారు. అది క్రైస్తవ సంఘం. 42 వీరు అపొస్తలుల బోధలో,సహవాసంలో,రొట్టె విరవడంలో ప్రార్ధనలో కొనసాగారు. 43 అప్పుడు ప్రతివానికి భయము కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలు సూచకక్రియలు చేశారు. 44 నమ్మిన వారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకొన్నారు. 45 అంతేగాక వారు తా ఆస్తిపాస్తులను అమ్మేసి అందరికి వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతి రోజు ఏక మనస్సుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్లల్లో రొట్టె విరుస్తూ, 47 ఆనందoతో,కపటంలేని హృదయంతో వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రతి రోజు సంఘంలో చేరుస్తున్నారు.