1
హెరోదు రాజు విశ్వాసులను హింసించుటకు కొంతమందిని పట్టుకుని,
2
యోహాను అన్న ను కత్తితో చంపించేను.
3
ఇది యూదులకు ఇష్టమైన కార్యముగా ఉండటం చూసి.పేతురును కూడా బందించెను.అవి పొంగని రొట్టెల దినములు.పేతురును బంధించి చెరసాలలొ వేసి, పస్కా పండుగ ముగిసిన తరువాత ప్రజల ముందరికి తీసుకురావలేనని నిర్ణయించారు,
4
అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించెను.
5
పేతురును చెరసాలలొ ఉంచారు.అయితే సంఘం పేతురు కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్ధన చేయుచుండెను.హేరోదు
6
అతనిని విచారించేందుకు తీసుకురావలని అనుకొనుచుండగా,ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్లు ఉన్న బంధకాలచేత ఇరువురు సైనికుల మధ్య నిద్రించుచుండెను.కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాయుచుండెను. దూత వలన పేతురు విడుదల
7
అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమాయెను.అతడున్న గదిలోనికి వెలుగు ప్రకాశించెను.దూత పేతురును తట్టి త్వరగా లెమ్మని చెప్పినప్పుడు,అతని చేతిసంకెళ్లు ఊడిపడెను.దూత
8
అతనితో "నీ నడుం కట్టుకుని, చెప్పులు తొడుక్కోమని"చెప్పెను.పేతురు అలాగే చేసాడు.ఆ పైన దూత అతనితో నీ "పై బట్ట వేసుకుని నాతో రా " అని చెప్పాడు.
9
అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్లి,దూత వలన సంభవించినది నిజమని ఎరుగక, తాను దర్శనం చూస్తున్నానేమో
10
అనుకొనెను.మొదటి కావలిని ,రెండవ కావలిని దాటిన తరువాత పట్టణంలోనికి వెళ్లే ఇనుప ద్వారము దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకొనెను.వారు ఆ ఇనుప ద్వారము అవతలికి వెళ్లి ఒక వీధి దాటిన తరువాత దూత అతని యెదుటనుండి వెళ్లిపోయెను.
11
పేతురుకు తెలివివచ్చి, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండి,యూదులు చేసిన వాటాన్నిటిలో నుండి నన్ను తప్పించెనని నాకు ఇప్పుడు నిజముగా తెలిసిందని
12
అనుకొన్నాడు.దీనిని గ్రహించిన తరువాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. చాలామంది విశ్వాసులు అక్కడ కూడి ప్రార్దన చేయుచుండెను.
13
అతడు తలుపు వాకిట తలుపు తట్టుచుండగా,రోదే అను ఒక చిన్న పిల్ల తలుపు తీయడానికి వచ్చింది.ఆ
14
చిన్నది పేతురు స్వరము గుర్తుపట్టి,ఆనందంలో తలుపు తీయకుండానే పరిగెత్తుకు పోయి,పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని వారితో చెప్పగా,అందుకు
15
వారు ఆమెను 'పిచ్చిదానివి' అనిరి.అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు,వారు
అతని దూత అయి ఉండవచ్చు అనుకొనిరి.
16
పేతురు ఇంకా తలుపు తట్టుచుండగా వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయినప్పుడు,అతడు
17
వారిని నెమ్మదిగా ఉండమని చేతితో సైగ చేసి, ప్రభువు తనను చెరసాలలో నుండి బయటకు ఎలా రప్పించెనోవారికి చెప్పి యాకోబుకూ, సహోదరులకూ
ఈ విషయాలు తెలియజేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు.
18
తెల్లవారగానే పేతురు ఏమయ్యేనో అని సైనికులు ఎంతో గాబరా పడిరి.
19
హేరోదు పేతురు కోసం వెతికించి అతను కనబడకుండుట చేత సైనికులకు మరణశిక్ష విధించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను. హేరోదు దుర్మరణం
20
తూరూ ,సీదోను నివాసులపై హీరోదుకు చాలా కోపం వచ్చినపుడు.వారంతా రాజు భవన సంరక్షకుడైన బ్లాస్తు దగ్గరకు వెళ్లి ,రాజుకు నచ్చజెప్పి తమకు సహాయం చేయవలసిందిగా వేడుకొన్నారు.ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉండేది.
21
నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజ వస్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చెను.
22
ప్రజలు ఇది దేవుని స్వరమే కానీ మనిషి కాదు అని కేకలు వేశారు.
23
అతడు దేవునికి మహిమ ఇవ్వనందుకు వెంటనే ప్రభువు దూత అతనికి భయంకర వ్యాధి కలిగించేను.
24
దేవుని వాక్యం అంతకంతకు వ్యాపించింది.
25
సౌలు యెరూషలేములో తమ సేవ నెరవేర్చిన తరువాత మార్కు అనే పెరు గల యోహానును వెంటబెట్టుకుని వచ్చెను.