1
తెఆఫీల యేసు ఆయన ఏర్పరచుకొనిన అపోస్తులలకు పరిశుధాత్మ ద్వారా అజ్ఞాపించిన తర్వాత ఆయన పరలోకమునకు తీసుకొనబడిన
2
రోజు వరకు ఆయన భోదించేంచుటకును ప్రారంభించిన వాటిని గురించి నా మొదటి గ్రంధమును రాసాను.ఆయన శ్రమ పడిన తరవాత 40 రోజులు వరకు ఆయన వారికి
3
కనబడుతూ దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తూ ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు.
4
మీరు యెరూషలేము నుండి వెళ్లక నా వలన వినిన తండ్రి వాగ్దానములను కనిపెట్టుడి అని వారికి చెప్పెను.
5
యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చాడు కానీ కొన్ని రోజుల్లో మీరు పరిశుద్దాత్మ తో బాప్టిజం తీసుకుంటారు అని చెప్పెను.6
6
వాళ్ళు కలసి ఉన్నప్పుడు ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును అనుగ్రహిస్తావ అని ఆయనను అడిగిరి.
7
కాలాలు , సమయాలు నా చేతిలో ఉన్నాయి. అది తెలుసుకోవడం మీ పని కాదు అని చెప్పారు.
8
అయిన మీకు పరిశుధాత్మ వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అప్పుడు మీరు యూదా సమరియా దేశములాంతట మీరు సాక్షులుగా ఉండండి అని వారితో చెప్పెను
9
ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తున్నపుడే ఆయన పైకి కొనిపోబడ్డాడు. వాళ్ళకి కనపడకుండా మేఘము ఆయన్ని తీసుకొని వెళ్ళింది.
10
ఆయన వెళ్తున్నపుడు వాళ్ళు ఆకాశము వైపు చూస్తున్నప్పుడు తెల్లని బట్టలు వేసుకున్న ఇద్దరు వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు నిలబడి ఇట్లు చెప్పారు.
11
గలిలయా మనుషులరా మీరెందుకు ఆకాశము వైపు చూస్తున్నారు.
మీ దగ్గర నుండి పరలోకమునకు ఎలా అయితే వెళ్ళాడో అలాగే మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు.
12
అప్పుడు వాళ్ళు ఆలివ్ కొండ నుండి ఎరుషాలేముకి వెళ్లారు
ఆ కొండ ఎరుషాలేముకి దగ్గరగా ఉంది
13
పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయా, ఫిలిప్పు, తోమ, భర్తలొమయి మతాయి, యాకోబు, సీమోను, యూదా అనే వాళ్ళు ఆ పట్టణములో వెళ్లి అక్కడ పైన ఉన్న గదిలోకి వెళ్లారు.
14
అక్కడ వేళ్ళతో పాటు యేసు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు అక్కడ కొంతమంది స్త్రీలు ప్రార్ధన చేస్తూ ఉన్నారు.
15
ఆ కాలంలో 120 మంది సహోదరులు ఉన్నప్పుడు వల్ల మధ్యలో పేతురు కూడా నిలబడి ఇలా అన్నాడు.
16
సహోదరులారా , యేసు ను పట్టుకోవడానికి దారి చూపించిన యూదా గురించి పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా చెప్పినది నెరవేరే సమయం వచ్చింది.
17
ఇతడు మనలో ఒకడిగా ఉండి ఈ పరిచర్యలో పలుపొందెను.
18
ఈ యూదా ద్రోహము వలను వచ్చిన డబ్బుతో ఈ పొలము కొన్నాడు.
కాబట్టి ఆయన తలక్రిందులుగా పదినడుము విరిగి బద్దలైనందున అతని పేగులన్ని బయటకి వచ్చాయి.
19
ఈ విషయం అందరికి తెలిసింది కాబట్టి ఆ పొలానికి ఆకెల్దామ అని పెరు పెట్టారు. అంటే దాని అర్థం రక్త భూమి. అందుకు
20
అందుకే అతని ఇల్లు పాడై పోవాలి, ఆ ఇంట్లో ఎవరు ఉండకూడదు. అతని ఉద్యోగం వేరొకరు తీసుకొనిపోవాలి అని కీర్తనలో వ్రాయబడి ఉంది.
21
కాబట్టి యోహాను బాప్తీస్మంమ్ ఇచ్చింది మొదలుకొని యేసు మనదగ్గర నుండి వెళ్లిపోయే వరకు
22
ఆయన మన మధ్య తిరుగుతూ ఉన్న కాలమంతమనలో కలిసున్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్దనమును గురించి సాక్షిగా ఉండడం అవసరం అని చెప్పెను.
23
అప్పుడు వాళ్ళు యోసేపును, బరబ్బా ను ఇద్దరిని నిలబెట్టారు.
24
ఇలా ప్రార్ధన చేశారు. అందరి హృదయములు తెలిసిన ప్రభువా
25
యూదా కి బదులుగా వేరొకని నిలబెట్టడానికి ఈ ఇద్దరిలో ఎవరో చూపించు అని అడిగారు.
26
అప్పుడు వాళ్ళు చీట్లు వేసినప్పుడు మతియా పెరు చీటీ వచ్చింది.
అప్పుడు 11 మంది అపోస్తులలో ఈ వ్యక్తి కూడా లెక్కించబడ్డాడు.